తమిళసినిమా: నూరు శాతం ఓట్లు నమోదు కావాలి.అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య తన ఓటును వృథా చేయడం విమర్శలకు దారి తీసింది. సోమవారం జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో సూపర్స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలహాసన్ విదేశాల్లో తన షూటింగ్ను కూడా రద్దు చేసుకుని ఓటు వేశారు.ఇక ఓటు వేస్తారో లేదో అని పరిశ్రమ వర్గాల్లో చర్చకు తావిచ్చిన నటుడు అజిత్ కూడా ఉదయాన్నే సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఎన్నికల అధికారులు నిర్వహించిన ఓటు యొక్క అవశ్యకతను వివరించే ప్రచార చిత్రాలలో నటించి అందురూ ఓటు వేయండి, నూరు శాతం పోలింగ్ నమోదు కావాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య ఓటు వేయకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికా వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికల కమీషన్ ఓటర్ల పట్టికలో ఓటర్ల పేర్లను సరిగా నమోదు చేయడంలోనూ,ఓటర్ల ఫోటోలను సక్రమంగా పొందుపరచడంలోనూ దృష్టి సారించకుంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసి సినీ తారలతో ఓటింగ్పై అవగాహనా ప్రచార చిత్రాలను రూపొందించి టీవీ.చానళ్లలో ప్రచారం చేయడానికే అధిక ప్రాముఖ్యత నిచ్చారు.అలా ప్రచార చిత్రాలలో నటించిన నటుల్లో సూర్య ఒకరు.
అలాంటి ఆయన తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికాలో కూర్చున్నారు.దీని గురించి ఆయన వివరణ రూపంలో ఒక ప్రకటన విడుదల చూస్తూ తాను ఓటింగ్ రోజుకు చెన్నైకి తిరి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయినా అనివార్యకారణాల వల్ల చెన్నైకి చేరుకోలేక పోయాననీ,ఆన్లైన్ లాంటి ఇతర సోర్సెస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాలేదనీ పేర్కొన్నారు.
తాను అందరికీ ఓటు వేయమని చెప్పి తాను ఓటు వేయనందుకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు పార్టీల గురించి తెలియని ఒక నిరుపేద నటి డబ్బు కోసం డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటిస్తే విమర్శలు గుప్పించిన వారు ఒక ప్రముఖ నటుడు తన ఓటును దుర్వినియోగం చేయడంపై మాట్లాడరా అన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపై ఎన్నికల కమీషన్ తారలతో అవగాహనా ప్రచార చిత్రాలు చేయడం మానుకోవాలనే గొంతు వినిపిస్తోంది.
ఓటు వేయని సూర్య
Published Tue, May 17 2016 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement