అందరూ అభిమానించేలా.. | Sakshi
Sakshi News home page

అందరూ అభిమానించేలా..

Published Thu, Jun 22 2017 11:34 PM

అందరూ అభిమానించేలా..

అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తుండగా, మరో ప్రధాన పాత్రలో సమంత నటిస్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నిర్మాత అశ్వినీదత్‌ కుమార్తె స్వప్న దత్‌   ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇటీవల తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని గండిపేటలో గురువారం ప్రారంభమైంది. స్వప్నదత్‌ మాట్లాడుతూ– ‘‘సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో దుల్కర్‌ ఎంటరయ్యారు. ‘మహానటి’ సినిమా సావిత్రి అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానినీ అలరించేలా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకి  మిక్కీ. జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement