Sakshi News home page

ఏసు నడిచిన ప్రదేశాల్లో...

Published Wed, Jun 7 2017 1:58 AM

ఏసు నడిచిన ప్రదేశాల్లో...

ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జె.జాన్‌బాబు దర్శకుడు. టి.సుధాకర్‌ నిర్మాత. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇంతవరకు వచ్చిన ఏసుక్రీస్తు చిత్రాలన్నీ ఒక ఎల్తైతే, ‘తొలికిరణం’ మరో ఎత్తు.

రియలిస్టిక్‌గా ఉండేందుకు క్రీస్తు నడిచిన ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఖర్చుకు వెనుకాడకుండా మంచి లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది.  అద్భుతమైన పాటలు అందించిన ఆర్పీ పట్నాయక్‌కి కృతజ్ఞతలు. సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. ఈ నెల 10న టీజర్‌ విడుదల చేసి, త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement