నేటి ప్రధాన వార్తల విహంగ వీక్షణం | Sakshi
Sakshi News home page

నేటి ప్రధాన వార్తల విహంగ వీక్షణం

Published Sun, Mar 25 2018 7:05 PM

Today News Round UP-March 25-2018 - Sakshi

టాలీవుడ్‌ అంత సులువుగా వదలదు
చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ తెలుగు టీవీ ఛానెల్‌ అనుసంధానకర్త సాంబశివరావుపై నటి మంచు లక్ష్మీ మండిపడ్డారు.

‘ఎన్టీఆర్ అభిమానులు ప్రతిరోజు ఏడుస్తున్నారు’
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులు ప్రతిరోజు ఏడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అన్నారు.

‘పవన్‌ నియమించిన ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు’
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య పవన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఘనంగా అంబానీల ఇంట నిశ్చితార్థం
అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ, వజ్రాల వ్యాపారీ రసెలా మెహతా కుమార్తె శ్లోకా మెహతాల నిశ్చితార్థం గోవాలో ఘనంగా జరిగింది.

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం
నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం ఘోరదుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

మోదీని దూషించారు: నటుడు శివాజీపై ఫిర్యాదు
ఆపరేషన్‌ ద్రవిడ పేరిట ఇటీవల బీజేపీపై పలు ఆరోపణలు చేసిన సినీ నటుడు శివాజీపై ఆ పార్టీ నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాంపరింగ్‌: ‍​కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్మిత్‌
బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!
తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement