సినిమాకు, ప్రేక్షకుల మధ్య ప్రధాన వారధి టూరింగ్ టాకీస్. ఆదిలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది, అలరించింది ఈ టూరింగ్ టాకీస్లోనే. ఆ తరువాత కాలానుగుణంగా టూరింగ్ టాకీస్ల చోటే పెద్ద పెద్ద సినిమా మాల్స్ నిలిచా యి. ఇందతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్వం రోజుల్ని గుర్తు తెచ్చేలా టూరింగ్ టాకీస్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. దీన్ని రూపొం దించింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో పలు విజ యవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఏ చం ద్రశేఖర్ తన 69వ చిత్రంగా ఈ టూరింగ్ టాకీస్ రూపొందించాడు. మరో విశేషం ఏమిటంటే తన చిత్రంలో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ దర్శక, నిర్మాత టూరింగ్టాకీస్లో ప్రధాన పాత్రలో నటించారు.
ఇది రెండు కథలతో కూడిన ఒక చిత్రం. అంతేకాదు టూరింగ్ టాకీస్ దర్శకుడిగా తన చివరి చిత్రం అని వెల్లడించేశారు. అభి శరవణ్, అశ్వినీకుమార్, సూనులక్ష్మి, గాయత్రి మొదలగు వారు యువ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కెవి స్టూడియోలో జరిగింది. కాగా రెండు కథలలో ఒక చిత్రం తెరకెక్కించిన ఎస్ఏ చంద్రశేఖర్ ఇదే వేదికపై ఆదివారం జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సభ్యుల బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా చాలా చిత్రాలు చేశానన్నారు. అయితే ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తూ పనిచేస్తానన్నారు. అయినా తాను సాధించిందేమీ లేదన్నారు.
విజయ్ను హీరోగా చేయమని చాలామంది చుట్టూ తిరిగా
తన కొడుకు విజయ్ నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు తాను ఎంతైన ఖర్చు పెడుతానని చిత్రం చేయమని చాలామంది దర్శకులను అడిగానన్నారు. అయితే ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే ఎందుకు దర్శక, నిర్మాతగా చేయరాదనే ఆలోచన రావడంతో విజయ్ హీరోగా చిత్రం చేశానని తెలిపా రు. ఆ తరువాత అతను నటుడిగా ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందేనని అన్నారు. ఇక టూరింగ్ టాకీస్ గురించి చెప్పాలంటే తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం ఈ చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా ఇదే తన చివరి చిత్రం అన్నమాట నిజమేనని అయితే ఇంతకుముందు చట్టం ఒరు ఇరుట్టరై చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ అంటూ పలుభాషలలో తెరకెక్కించానని అదే విధంగా ఈ టూరింగ్ టాకీస్ను కూడా పలు భాషలలో రూపొందించనున్నట్లు ఎస్ఏ చంద్రశేఖర్ వెల్లడించారు.
‘టూరింగ్ టాకీస్’ ముచ్చట్లు
Published Tue, Jan 27 2015 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement