యథార్థ గాథ | Sakshi
Sakshi News home page

యథార్థ గాథ

Published Thu, Sep 24 2015 11:05 PM

యథార్థ గాథ

నాగపూర్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన  చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు నాయుడు ముఖ్య పాత్ర లుగా ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్ పర్వతరెడ్డి నిర్మించారు. జోస్యభట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రాన్ని ‘అసురన్’ అనే పేరుతో తమిళంలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మహిళలను చైతన్యపరిచే కథాంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు’’ అని అన్నారు. కవి గోరటి వెంకన్న, మాటల రచయిత వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement