'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా | Sakshi
Sakshi News home page

'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా

Published Fri, Dec 23 2016 10:39 PM

'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా

విజయవాడ: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ డీజీపీ సాంబశివరావుని శుక్రవారం కలిశారు.

తాము చెప్పిన అభ్యంతరాలను రామ్‌గోపాల్‌వర్మ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement