కళ అనేది ప్రాంతాలకు, భాషలకు అతీతమైంది. అందుకు శకుంతలే ఓ నిదర్శనం. శకుంతల పుట్టింది మహారాష్ట్రలో. కానీ.. ఎదిగింది, ఒదిగింది, ఒరిగింది తెలుగు నేలపైనే. అందుకే... తెలుగు కళారంగానికి దొరికిన ఓ మణిహారంగా ఆమెను అభివర్ణించడం తప్పేం కాదు. తెలుగు రంగస్థలంపై నటనకు ఓనమాలు దిద్దుకున్న శకుంతల... తర్వాత కాలంలో తెలుగు తెరపై మూడున్నర దశాబ్దాల నట ప్రస్థానాన్ని సాగించారు. తెలంగాణ సాయుధ పోరాటంపై బి.నరసింగరావు నిర్మించిన ‘మాభూమి(1979)’ చిత్రంతో తొలిసారి తెలుగుతెరపై మెరిశారు శకుంతల.
తర్వాత తెలంగాణ నేపథ్యంలోనే రూపొందిన రంగులకల(1983), కొమరంభీమ్(1984) చిత్రాల్లో నటించి ‘తెలంగాణ’ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. కానీ.. ఒక్క తెలంగాణ యాస మాత్రమే కాదు, తెలుగు భాషలోని యాసలన్నింటినీ అలవోకగా పలికించగలిగిన దిట్ట శకుంతల. ‘ఒక్కడు’ (2003)లో రాయలసీమ యాసలో మాట్లాడిన ఆమే... కొన్ని చిత్రాల్లో శ్రీకాకుళం యాసతో కూడా భళా అనిపించారు. గోదావరి యాసలోని కమ్మదనాన్ని కూడా తన గళంతో వినిపించారు. అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే. శకుంతల ఆహార్యాన్నీ, వాచకాభినయాన్నీ గమనించిన ఎవరూ ఆమె మహారాష్ట్ర మహిళ అంటే నమ్మరు.
కెరీర్ తొలినాళ్లలో శకుంతల చేసినవన్నీ చిన్నా చితకా పాత్రలే. వాటిల్లో జంధ్యాల ‘అహనా పెళ్లంట’(1987) ఒకటి. అందులో కూడా శకుంతల పాత్ర నిడివి రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ... ఇప్పటికీ ఆ పాత్ర జనాలకు గుర్తుండి పోయిందంటే... ఆమె నట సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆవేశపూరితమైన పాత్రలతోనే కాదు, హాస్యంతో కూడా మెప్పించగలనని ఆ సినిమాతో నిరూపించారామె. వెండితెరపై శకుంతలకు తొలి బ్రేక్ కృష్ణవంశీ ‘గులాబి’(1995). ఇక తేజ ‘నువ్వు-నేను’(2001) చిత్రమైతే ఆమెను ఏకంగా స్టార్ని చేసేసింది. ఆ సినిమాలో శకుంతల అనితరసాధ్యమైన విలనిజం ప్రదర్శించారు.
ఒక్కడు, వీడే, గంగోత్రి, ఎవడిగోల వాడిది, లక్ష్మి, దేశముదురు, బెండు అప్పారావు ఆర్.ఎం.పి... తదితర హిట్ చిత్రాల్లో నటించి తెలుగుతెరపై తనదైన సంతకాన్ని లిఖించారు శకుంతల. ‘మచ్చకాళై’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారామె. దాదాపు 80 చిత్రాల్లో నటించిన శకుంతల చివరి సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’(2014).
ఈవీవీ ‘ఎవడిగోల వాడిదే’ చిత్రీకరణ సమయంలోనే శకుంతలకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ‘ఒక వేళ నేను చనిపోతే... మేకప్లో చనిపోయిన అదృష్టం కలిగేది’ అని పలు సందర్భాల్లో చెప్పుకున్నారామె. నటనపై శకుంతలకున్న మమకారానికి ఇదొక గొప్ప నిదర్శనం. హాస్య, భయానక, బీభత్స, రౌద్ర, విషాద రసాల్లోని దేన్నయినా అవలీలగా పలికించగల మంచి నటి శకుంతల దూరమవ్వడం తెలుగుతెరకు నిజంగా తీరని లోటు.
అన్ని యాసలూ ఆమెకు సునాయాసమే!
Published Sat, Jun 14 2014 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement