'ఏమంత్రం వేసావే' అంటున్న అర్జున్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

'ఏమంత్రం వేసావే' అంటున్న అర్జున్‌రెడ్డి

Published Thu, Oct 19 2017 12:32 PM

vijay devarakonda new film mantram vesave

సాక్షి, హైదరాబాద్‌: 'పెళ్లి చూపులు' చిత్రంతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న ‘అర్జున్‌రెడ్డి’  తాజగా మరో చిత్రానికి రెఢీ అవుతున్నారు. మరో అందమైన ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. మర్రి శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఏమంత్రం వేసావే' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.  ఈ ఫస్ట్‌లుక్‌లో విజయ్‌ పడుకుని దీనంగా ఆలోచిస్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అల్లు అరవింద్‌ నిర్మాణంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘మహానటి’  చిత్రంలోనూ విజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ సమాచారం.

Advertisement
Advertisement