ఇటు పరిశ్రమలోను, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొ న్న చిత్రాల్లో 10 ఎండ్రదుకుళ్ల చిత్రం ఒకటి. కారణాలు చాలానే ఉన్నా యి. ఫాక్స్ స్టూడియోస్, ఏఆర్ మురుగదాస్ చిత్రనిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నాలుగవ చిత్రం ఇది.ఫాక్స్స్టూడియోస్ సంస్థ రీసెం ట్గా కాక్కముట్టై చిత్ర అమోఘ విజయంతో పుల్ జోష్లో ఉండ గా, ఏఆర్ మురుగదాస్ సంస్థతో కలిసి ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మిం చింది.
ఇక దర్శకుడు విజయ్ విల్టన్ గోలీసోడా వంటి బ్లాక్బస్టర్ చిత్రం తరువాత తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 10 ఎన్డ్రదుకుళ్ల.అలాగే సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఐ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం, కత్తి వంటి సూపర్ హిట్ చిత్రంతో ఫామ్లోకొచ్చిన సమంత హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 10 ఎన్డ్రదుకుళ్ల. ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంపై ఎన్ని అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ చిత్ర షూటింగ్ తుది షెడ్యూల్ ఆగస్ట్ చివరి కల్లా పూర్తి అవుతుందని అక్టోబర్ 21న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు.
# Tag
Related news
-
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
పెళ్లి జ్ఞాపకాల్ని అలా మార్చేసిన సమంత.. వీడియో వైరల్
సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. ఇంతకీ అసలేంటి విషయం?'ఏ మాయ చేశావె'తో హీరోయిన్ అయిపోయిన సమంత.. ఇదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యని లవ్ చేసింది. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ప్రేమకు 2017లో ఎండ్ కార్డ్ వేశారు. పెద్దల్ని ఒప్పించి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ నాలుగేళ్లలో అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.అయితే పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే. View this post on Instagram A post shared by Krésha Bajaj (@kreshabajajofficial) -
ఆ మ్యూజిక్ డైరెక్టర్పై సమంత ప్రశంసలు
ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ తరం హీరోయిన్లకు బాగా తెలుసు. ఇందుకు నటి సమంత అతీతం కాదు. ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ తరువాత మరో చిత్రంలో నటించలేదు. అలాగని తెరమరుగు కాలేదు. తన గ్లామరస్ ఫొటోలతో, ఫిట్నెస్ ఫొటోలతోనో, ఇతరుల గురించి కామెంట్స్ చేయడంతోనో తరచూ వార్తల్లో ఉంటారు. మరో పక్క ఈమె నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో హల్చల్ చేస్తుంటాయి. ఒక పక్క మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూనే ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్న జాన సమంత. కాగా ఈమె నటించిన ది ఫ్యామిలీ స్టోరీ– 2 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. కాగా సమంత ఓ మలయాళ సంగీత దర్శకుడిని మేధావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇన్స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇటీవల విజయాలతో కళ కళలాడుతోంది. తక్కువ బడ్జెట్తో చిత్రాలు చేసి భారీ లాభాలను చవి సూస్తున్నారు. అలా ఇటీవల బ్రహ్మయుగం,ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ది గోట్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ కోవలోకి ఆవేశం చిత్రం చేరింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహత్ ఫాజిల్ తాజాగా కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ఆవేశం. ఈనెల 11న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్టు వసూలు చేసిందని సమాచారం. కాగా ఈ చిత్రానికి నటి సమంత తన ఇన్స్ట్రాగామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా ఆ చిత్ర సంగీత దర్వకుడు సుషిన్ శ్యామ్పై పొగడ్తల వర్షం కురిపించింది. -
సమంత లగ్జరీ బ్రాండ్ వాచ్.. ధర ఎంతంటే..!
టాలీవుడ్ నటి సమంత చక్కటి ఫ్యాషన్ దుస్తుల పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. ప్రతి డ్రెస్ అత్యంత లగ్జరియస్ బ్రాండ్కు చెందినవే. ఈసారి మంచి కలర్ఫుల్ లుక్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్ జాకెట్, స్కర్ట్ ధరించి.. క్యూట్ లూక్తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్ ఫోల్డర్లు, ఫుల్ స్లీవ్ల్లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్ స్టడెడ్ సెర్పెంటి స్పిగా వాచ్ ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్ డయల్ చ్టుటూ సిల్వర్ ఒపలైన్ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్ బ్రాస్లెట్ మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్ సమంతాకి కొత్త లుక్ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్ బ్లాక్ దుస్తులను ధరించినప్పుడూ వాచ్ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్ వీడియో ఈవెంట్కు కూడా ఈ సర్పెంటీ వాచ్ని ధరించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్ కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్లు స్టైయిల్ష్ లుక్ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్లతో పొదగబడిన ఈ వాచ్ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్కి తగ్గ రేంజ్ ధర కాబోలు..! View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!)
Related News by category
-
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డ్తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్లెన్స్ అవార్డ్తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్లెన్స్ అవార్డ్ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్లో అల్లు అర్జున్కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement