ఆ హీరోయిన్ ఎందుకు ఏడుస్తూ వెళ్లిపోయింది? | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ ఎందుకు ఏడుస్తూ వెళ్లిపోయింది?

Published Mon, Aug 17 2015 3:02 PM

ఆ హీరోయిన్ ఎందుకు ఏడుస్తూ వెళ్లిపోయింది?

మొన్నీమధ్య బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఓ కార్యక్రమంలో పాల్గొంటూ.. మధ్యలో ఉన్నట్టుండి ఏడుస్తూ హడావుడిగా వెళ్లిపోయింది. ఆమెకు ఓ ఫోన్ కాల్ రావడంతో వెంటనే వేదిక దిగిపోయి, కళ్లు తుడుచుకుంటూ కారు వద్దకు వెళ్లి, డ్రైవర్ అక్కడ లేకపోవడంతో అతడికి ఫోన్ చేసి.. రాగానే తాళాలు తీసుకుని తానే కారు డ్రైవ్ చేసుకుంటూ వేగంగా వెళ్లిపోయింది. కాజోల్ ఇలా ఏడుస్తూ వెళ్లడానికి కారణమేంటా అని అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. అజయ్ దేవ్గణ్ - కాజోల్ దంపతుల కుమారుడు యుగ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడట. ఆ విషయమై ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పిల్లలంటే అమితమైన ప్రేమ ఉన్న కాజోల్.. తన ముద్దుల కొడుకు విషయం తెలిసి తట్టుకోలేకపోయింది.

అందుకే తన కొడుకును చూసేందుకు వెళ్లిపోయింది. వాస్తవానికి కాజోల్ అలా ఏడుస్తూ వెళ్లడంతో ఆమె అభిమానులతో పాటు సామాన్యులు కూడా చాలా కలవరపడ్డారు. అసలేమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. చివరకు అజయ్ దేవ్గణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయం చెప్పి.. యుగ్ ఇప్పుడు బాగానే ఉన్నాడని, మళ్లీ స్కూలుకు కూడా వెళ్తున్నాడని చెప్పాడు. తన కొడుకు ఆరోగ్యం గురించి, కాజోల్ ఆందోళన గురించి అడిగిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
Advertisement