కోలీవుడ్లో దిగ్గజాల్లాంటి నటులు విశ్వనటుడు కమలహాసన్, సూపర్స్టార్ రజనీకాంత్. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే?అందులో రజనీకాంత్కు కమలహాసన్ విలన్గా మారితే? అంత కంటే సంచలనం ఇంకోటి ఉండదు.అయితే అది సాధ్యమయ్యే పనేనా?అలాంటి దుసాధ్య కార్యాన్ని సాధ్యం చేసే ధిశగా స్టార్ డెరైక్టర్ శంకర్ ఇటీవల అడుగులు వేశారు కానీ సఫలం కాలేదు.రజనీకాంత్,శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం సాధించిన రికార్ట్ను నేటికీ మరో చిత్రం బద్దలు కొట్టలేదు.
అలాంటి చిత్రానికి తాజాగా 2.ఓ పేరుతో సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యధికంగా 350 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్కు ప్రతినాయకుడిగా మొదట హాలీవుడ్ సూపర్స్టార్ ఆర్నాల్డ్ను నటింపజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు శంకర్. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ రెడీ అన్నంతగా ప్రచారం మారుమోగింది. అయితే అలా జరగలేదు. ఆ తరువాత సూపర్స్టార్కు విలన్గా విశ్వనాయకుడిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ కమలహాసన్ కూడా రజనీకాంత్కు ప్రతినాయకుడిగా మారడానికి అంగీకరించలేదు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ఆ పాత్రలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది.
రజనీకాంత్కు విలన్గా నటించడానికి కారణాన్ని కమలహాసన్ ఇటీవల బహిరంగపరచారు. ఈ అంశం గురించి ఆయన తెలుపుతూ రజనీ తానూ ఇంతకు ముందు చాలా చిత్రాలు కలిసి నటించామన్నారు. ఆ తరువాత విడివిడిగా హీరోలుగా నటిస్తున్నామని అన్నారు. ఒకవేళ మళ్లీ తాము కలిసి నటించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే ఆ చిత్రాన్ని తామిద్దరం కలిసి నిర్మించాలని, లేదా తమలో ఎవరైనా ఒకరు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కానీ రజనీకి తాను విలన్గా నటించడానికి నిరాకరించాననడంలో వాస్తవం లేదన్నారు. అలా చూస్తే తాను చాలా చిత్రాల్లో విలన్గా నటించానని అన్నారు. అయితే ఇప్పుడు 2.ఓ చిత్రంలో పేద్ద నటుడే రజనీకి విలన్గా నటిస్తున్నారని కమలహాసన్ పేర్కొన్నారు.
ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..
Published Wed, Jun 1 2016 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement