Sakshi News home page

ఏడిద నాగేశ్వరరావుకు ప్రముఖుల సంతాపం

Published Sun, Oct 4 2015 7:57 PM

ys jagan, chandra babu condole to edida nageswar rao's death

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

ఏడిద నాగేశ్వరరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని కళాతపస్వి కే విశ్వనాథ్ నివాళులు అర్పించారు. రాజకీయ, చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏడిద నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
 

Advertisement

What’s your opinion

Advertisement