ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు

Published Sun, Dec 31 2017 12:52 PM

auto roll over..10 injured

నల్గొండ : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌ వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చింతపల్లి నుంచి మాల్‌ వైపు వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా చింతపల్లి మండలం కూరంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement