కరోనా తీవ్ర రూపం.. ఒక్కరోజే 1008 పాజిటివ్‌ | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఒక్కరోజే 1008 కరోనా కేసులు

Published Fri, May 1 2020 9:41 PM

1008 New Corona Positive Cases Reported In Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోనే 24 గంటల్లో ఆ రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 1,008 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్‌ బారినపడి ఇవాళ చికిత్స పొందుతూ మరో 26 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11,506కి చేరుకుంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1, 879 మంది డిశ్చార్జ్ కాగా,  485మంది మరణించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement