రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిధులపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ పథకానికి తన వాటా నిధులైన రూ. 12,230 కోట్లను శనివారం రాష్ట్రాలకు విడుదల చేసింది. ఏక మొత్తం ఇంత భారీగా నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది(2015-16) వేతన బకాయిల మొత్తం చెల్లింపుతో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ పథకం లక్ష్యాలను సాధించేందుకుగానూ అన్ని వనరులను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉపాధిహామీ పథకం అమలుకోసం రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకపోవడంపై గత బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరువు ప్రభావిత రాష్ట్రాల్లో ఈ పథకంపై చేసిన ఖర్చు వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఉపాధిహామీ పథకానికి సంబంధించి వేతనాలు-మెటీరియల్ నిష్పత్తిని గ్రామ పంచాయతీ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలోనే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆస్తుల కల్పనకు జిల్లా స్థాయిలో 60ః40 నిష్పత్తిలో వేతనాలు-మెటీరియల్ నిష్పత్తిని నిర్వహించాలని నిర్ణయించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
12 వేల కోట్ల ఉపాధి నిధులు
Published Sun, Apr 10 2016 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement