ఘోర ప్రమాదం :13 మంది మృతి | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో ఘోర ప్రమాదం :13 మంది మృతి

Published Tue, Nov 7 2017 11:13 AM

 13 killed in road accident near Kheda's Kathlal on Indore-Ahmedabad highway - Sakshi

అహ్మదాబాద్ : గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేదాల్‌లోని కతలాల్ ప్రాంతంలో వెనుక నుంచి వచ్చిన తుపాన్ వాహనం.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement