రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం

Published Fri, Jun 12 2015 1:51 PM

14 killed, 20 injured in road accident

లుథియానా:   పంజాబ్లోని జలంధర్లో  శుక్రవారం ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రయివేటు బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో14 మంది దుర్మరణం చెందారు. మరో 20  మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప  ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. బస్సు నవాన్శహర్ నుండి జలంధర్  వెడుతుండగా బెహ్రం దగ్గర మూలమలుపు దగ్గర అదుపుతప్పిచెట్టును ఢీ కొట్టిందని సీనియర్ ఎస్పీ  స్నేహదీప్ శర్మ తెలిపారు.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement