కదిలేకారులో యువతిపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

కదిలేకారులో యువతిపై సామూహిక అత్యాచారం

Published Mon, Sep 8 2014 2:38 PM

కదిలేకారులో యువతిపై సామూహిక అత్యాచారం

ప్రతాప్గఢ్: నలుగురు దుండగులు కదిలేకారులో ఓ 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలిని అలహాబాద్కు చెందిన యువతిగా గుర్తించారు.

బాధితురాలు రాణిగంజ్కు వెళ్లేందుకు నిందితుల్లో ఒకరిని సాయం కోరగా, అతను మరో ముగ్గురిని వెంటతీసుకెళ్లాడు. దారి మధ్యలో నలుగురూ ఆమెపై దారుణానికి పాల్పడి రోడ్డుపైకి తోసేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement