ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

Published Tue, Dec 19 2017 8:59 AM

2 unidentified terrorists killed in encounter in Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌ : ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం అర్థరాత్రి భద్రతాదళాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. షోపియన్‌లోని వానీపోరా ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారం ఆ ప్రదేశాన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 

అనంతరం వెతుకులాట ప్రారంభించామని, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు వారిని కాల్చివేశాయని వివరించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మూడో ఉగ్రవాదిని పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement