పోలీసులతో ఘర్షణ..20 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

పోలీసులతో ఘర్షణ..20 మందికి గాయాలు

Published Tue, Jul 7 2015 5:34 PM

20 injured in clash with police

ఒడిశా: ఒడిశాలోని ఆనంద్పూర్ అనే ప్రాంతంలో పోలీసులకు కొందరు గ్రామస్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుని 20 మంది గాయాలపాలయ్యారు. వారిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఓ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణగా మారడంతో దానిని సర్దుమనిగేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పరస్పరదాడికి కారణమైంది. జాతీయ రహదారి-215 విస్తరణలో భాగంగా కోసేయ్ నదిపై ఓ వంతెనను నిర్మించాల్సి వచ్చింది. అయితే, తమ ప్రాంతంలో ఈ వంతెన నిర్మించడానికి వీలు లేదంటూ గ్రామస్థులు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.

అది కాస్త మంగళవారం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. చాలామంది వంతెన నిర్మాణ ప్రాంతానికి వచ్చి అక్కడి కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన బ్లాక్కు నిప్పంటించారు. అక్కడి అధికారులపై దాడులకు ప్రయత్నించారు. పలు వస్తువులు ధ్వంసం చేశారు. దీంతో, పోలీసులు వారిని అదుపుచేస్తుండగా ఘర్షణ ఉదృతంగా మారి రాళ్లు రువ్వుకోవడం పోలీసులు లాఠీ ఛార్జీలు చేయడంవంటివాటితో ఇరువర్గాలు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement