భోజనం వికటించి 200 మందికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి 200 మందికి అస్వస్థత

Published Mon, Apr 17 2017 4:18 PM

200 members hospitalized in bihar over food poisoning

నవడా: ఓ ఉత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన విందు భోజనం వికటించి 200 మంది ఆస్పత్రి పాలయ్యారు. నవడా జిల్లా ఆంతి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా శ్రద్ధ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఆహారం తిన్న వారిలో సుమారు 200 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని ఇళ్లకు పంపించారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

Advertisement
Advertisement