2500 మంది ఖైదీలకు విముక్తి | Sakshi
Sakshi News home page

2500 మంది ఖైదీలకు విముక్తి

Published Mon, Sep 8 2014 7:35 PM

2500 మంది ఖైదీలకు విముక్తి

 చెన్నై: తమిళనాడులో 2500 మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. ఈ రాష్ట్రంలో నిర్వహించిన జైల్ అదాలత్‌లో ఈ ఖైదీలకు విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. విచారణ ఖైదీలు చేసిన నేరానికి తగిన శిక్షాకాలంలో 50 శాతం పూర్తి చేసినట్లయితే విడుదలకు అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే తమ కేసుల వాదోపవాదాలకు న్యాయవాదులను నియమించుకోలేనివారు, కోర్టులు విధించే జరిమానాలను చెల్లించలేని పేదల కేసులను జైల్ అదాలత్ పరిధిలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఆయా కేటగిరీలకు చెందిన నిందితులు తమ నేరాన్ని అంగీకరించి, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన పక్షంలో విడుదల చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 121 జైళ్లలో జైల్ అదాలత్ నిర్వహించి 2500 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందగానే రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులతో విడుదల చేస్తామని జైళ్లశాఖ ఐజీ మవురియా  తెలిపారు.
**

Advertisement
Advertisement