Sakshi News home page

రక్తమోడిన రాజస్తాన్ రోడ్లు

Published Fri, Jul 8 2016 3:49 AM

రక్తమోడిన రాజస్తాన్ రోడ్లు - Sakshi

రెండు ప్రమాదాల్లో 26 మంది మృతి
జైపూర్/జోధ్‌పూర్: రాజస్తాన్‌లో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 26 మంది మృతి చెందగా, 45 మంది గాయాలపాలయ్యారు. సిరోహి జిల్లా వీరా వీర్పూర్ గ్రామానికి సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. నాసిక్ నుంచి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తూ ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు నడి రోడ్డుపై వాదనకు దిగగా.. వారికి సర్ధిచెప్పేందుకు కొంత మంది బస్సులోని ప్రయాణికులు కిందికి దిగారు. అదే సమయంలో సిరోహి వైపుగా వెళ్తున్న మరో ట్రక్కు వేగంగా వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

What’s your opinion

Advertisement