రోడ్డు ప్రమాదంలో నలుగురు భక్తుల మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు భక్తుల మృతి

Published Wed, Aug 12 2015 11:44 AM

4 killed, 35 injured as bus collides with truck in UP Jaunpur

లక్నో: ఉత్తరప్రదేశ్ జాన్పూర్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  యాత్రికులతో వస్తున్న బస్సు అదుపు తప్పి  ట్రక్ను ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే  ప్రాణాలు విడిచారు.   మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.  వింధ్యాచల్ సందర్శనకు వెళ్లిన భక్తులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  చనిపోయినవారిని శశికళ (30) ధర్మశాల, (60) అనిత, (30) అజయ్ శర్మ(28) గా  గుర్తించారు. అటు గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.  పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత   మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్టు తెలిపారు.
 

Advertisement
Advertisement