16వ లోక్సభలో 61 మంది మహిళలు | Sakshi
Sakshi News home page

16వ లోక్సభలో 61 మంది మహిళలు

Published Sun, May 25 2014 1:34 PM

16వ లోక్సభలో 61 మంది మహిళలు

న్యూఢిల్లీ: లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 16వ లోక్సభకు 61 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. లోక్సభలో అత్యధికమంది మహిళా ఎంపీలు కొలువుదీరనుండటం ఇదే రికార్డు.

గత లోక్సభకు 58 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఈసారి ముగ్గురు ఎక్కువ. కాగా విద్యార్హతలతో పోలిస్తే ప్రస్తుత ఎంపీలు వెనుకబడ్డారు. తాజా సభలో 75 శాతం మంది మహిళా ఎంపీల కనీస విద్యార్హత డిగ్రీ కాగా, 15వ లోక్సభలో 79 శాతం మంది డిగ్రీ పూర్తి చేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement