కొత్త కాగ్‌గా రాజీవ్‌ మహర్షి ప్రమాణం | Sakshi
Sakshi News home page

కొత్త కాగ్‌గా రాజీవ్‌ మహర్షి ప్రమాణం

Published Tue, Sep 26 2017 4:29 AM

Rajiv Maharshi is the new CAG

న్యూఢిల్లీ: నూతన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ మహర్షి సోమ వారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

2020, ఆగస్టు 7 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మహర్షి 1978 బ్యాచ్, రాజస్తాన్‌ కేడర్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారి. గత నెలలో హోం శాఖ కార్యదర్శిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ, బీఏ డిగ్రీలు అందుకున్నారు. గ్లాస్గోలోని యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాత్‌క్లైడ్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కేంద్రం, రాజస్తాన్‌ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో తన విధులను నిర్వర్తించారు.

Advertisement
Advertisement