ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!

Published Thu, Feb 12 2015 9:17 AM

ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఆపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తాజా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు కృషి చేసిన ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్తో కలిపి 11 మందితో కేబినెట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతం కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

కొత్తగా ఏర్పడే కేబినెట్లో పాత మంత్రులు ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉంది. సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాఖీ బిద్లాన్లు, గిరీశ్ సోనీ, సోమ్నాథ్ భారతీలకు కేబినెట్లో చోటు దక్కకపోవచ్చునని భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement