శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ జమ్ము కశ్మీర్ కమాండర్ గా మహ్మద్ ఘజ్వానీ అలియాస్ సబ్జార్ అహ్మద్ భట్ ను నియమిస్తున్నట్టు ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు హిజ్బుల్ ఛీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని రత్ సునాకు చెందిన ఘజ్వానీ బుర్మాన్ వనీ కి అత్యంత సన్నిహితుడు. కాగా ఘజ్వానీ నియామకాన్ని భద్రతా దళాలు దృవీకరించాల్సి ఉంది. శుక్రవారం భద్రతా దళాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 22 ఏళ్ల బుర్మాన్ వనీ హతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆరాష్ట్రంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మృతుల సంఖ్య 25 కు చేరింది.