సాక్షి, న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా మండిపడ్డారు. అఖిలేష్ కుంగుబాటుతో సతమతమవుతున్నారని అన్నారు. డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్తో బీజేపీకి సంబంధాలున్నాయని అభిషేక్ ఆరోపణల నేపథ్యంలో మౌర్య ఈ వ్యాఖ్యలు చేశారు. డేరా బాబాతో పలువురు బీజేపీ నేతల ఫోటోలను అఖిలేష్ ప్రస్తావించారు.
అఖిలేష్ ఆరోపణలను మౌర్య తోసిపుచ్చారు. గుర్మీత్ సింగ్తో బీజేపీ నేతలకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. యూపీలో వీఐపీ సంస్కృతిని ప్రోత్సహించబోమన్నారు. తొలి ఆరు నెలల యోగి సర్కార్లో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడామన్నారు.