- జూలై 1న సామాహిక రాజీనామాలు
- పన్నెండువేల మంది ప్రభుత్వ వైద్యుల హెచ్చరిక
- సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సార్వజనిక ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులందరూ సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ లో పన్నెండు వేల మంది వైద్యులు పనిచేస్తున్నారు.
జూలై ఒకటో తేదీన ‘డాక్టర్స్ డే’ పురస్కరించుకొని సామూహికంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర స్టేట్ గెజిటెడ్ మెడికల్ అధికారుల సంఘం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వైద్యాధికారులకు పదోన్నతులు, వేతనాల పెంపు, పదవీ విరమణ కాలం పెంపు తదితర పది కీలక డిమాండ్లను సీఎం చవాన్ ముందు ఉంచాం. అందుకు ఆయన పదిరోజుల్లో కొన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కాని 20 రోజులు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయానికి వచ్చామ’ని ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం మాట తప్పడంతోనే సామూహిక రాజీనామాలుచేసి ఆందోళనకు దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు గెజిటెడ్ మెడికల్ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్ గైక్వాడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ రక్షమ్వార్ వెల్లడించారు.
తమ ఆందోళనను చవాన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ముంబైలోని ఆజాద్మైదాన్లో తామిరువురం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వైద్యులు తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతాయని, దీంతో వైద్యం అందక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులు పడడం ఖాయ మని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల రాజీనామాస్త్రం!
Published Wed, Jun 25 2014 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement