డీఎన్‌ఏ పరంగానైనా భారతీయులంతా హిందువులే | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ పరంగానైనా భారతీయులంతా హిందువులే

Published Sat, Mar 14 2015 1:42 AM

డీఎన్‌ఏ పరంగానైనా భారతీయులంతా హిందువులే

నాగ్‌పూర్: దేశంలో మెజారిటీ, మైనారిటీ అనే భావనే సరైంది కాదని, భారతీయులంతా హిందువులేనని ఆరెస్సెస్ పేర్కొంది. సాంస్కృతిక పరంగా, జాతీయపరంగా, చివరకు డీఎన్‌ఏ పరంగా చూసినా భారతీయులంతా హిందువులేనని సంఘ్ సీనియర్ నేత దత్తాత్రేయ హోసబలే అన్నారు. నాగపూర్‌లోని సంఘ్ ప్రధాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అఖిలభారతీయ ప్రతినిధి సభలో మేధోమథనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 రాజ్యాంగ అధికరణాన్ని రద్దు చేయాలన్న తమ సైద్ధాంతిక కట్టుబాటులో సడలింపు లేదన్నారు.
 

Advertisement
Advertisement