ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

Published Sat, Jul 19 2014 3:15 AM

ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు - Sakshi

అలహాబాద్:ప్రధాని నరేంద్రమోడీకి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోడీ ఎన్నికవ్వడం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈ నోటీసులిచ్చింది. వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజయ్‌రాయ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన వీటిని జారీ చేసింది.  ఎన్నికల అఫిడవిట్‌లో భార్య యశోదా పాన్ కార్డు వివరాల కాలమ్‌ను మోడీ ఖాళీగా వదిలేశారని, ఎన్నికల్లో రూ. 70 లక్షలకు మించి ఖర్చు చేశారని అజయ్ ఆరోపించారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement