అహ్మదాబాద్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో మొత్తం 182 నియోజకవర్గాల్లోని 50,128 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం బీజేపీ ‘మన్కీ బాత్ చాయ్ కే సాత్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. బీజేపీ చీఫ్ అమిత్ షా రాష్ట్రంలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన దరియాపూర్లో స్థానికులు, పార్టీ కార్యకర్తలతో టీ తాగుతూ ప్రధాని మన్కీ బాత్ కార్యక్రమాన్ని రేడియోలో విన్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదజన్ ప్రాంతంలో, గుజరాత్ సీఎం రూపానీ పంచమహల్ జిల్లాలోని మోరా గ్రామంలో, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మెహసనాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఉమా భారతి, స్మృతీ ఇరానీ, గుజరాత్ బీజేపీ చీఫ్ జీతూ వాఘానీతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు.