న్యూఢిల్లీ: కేంద్ర వైద్య సేవల్లో ఉన్న డాక్టర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 4వేల మంది డాక్టర్లకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉన్న డాక్టర్ల రిటైర్మెంట్ వయసును 65 పెంచాలని నిర్ణయించాం. మే 31, 2016 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ నిర్ణయం కారణంగా.. తమ దగ్గరున్న అనుభవజ్ఞులైన వైద్యుల నాణ్యమైన సేవలను మరికొంత కాలం దేశానికి అందించే అవకాశం దక్కిందని మరో ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల వేడుకల సందర్భంగా.. మే 26న సహరాన్పూర్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ దీనిపై ప్రకటన చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఈ నిర్ణయం వెలువడినట్లు జేపీ నడ్డా తెలిపారు.
ఉగ్రవాదంపై పోరాటం కోసం దేశాలను ఏకం చేయాలి: మోదీ
ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై పోరులో వివిధ దేశాలను ఏకం చేయాల్సిన బాధ్యతను దౌత్యవేత్తలే తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో ఐదురోజులుగా జరుగుతున్న హెడ్స్ ఆఫ్ డిప్లొమాట్స్ సదస్సులో చివరి రోజైన మంగళవారం ఆయన హాజరయ్యారు. ‘దౌత్యపరమైన విషయాల్లో మనం కొత్త శకంలోకి అడుగుపెట్టాం. ఇకపై భారత ఆకాంక్షలను ప్రపంచవ్యాప్తం చేయాలి’ అని పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయటంలో దౌత్యవేత్తల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు చాలా అవసరమని దీనికి మనమే నాయకత్వం వహించాలని చెప్పారు. విదేశాంగ విధానం, ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ దేశాలతో భారత ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై ఈ సదస్సులో చర్చించారు.
డాక్టర్లపదవీ విరమణ 65 ఏళ్లకు పెంపు
Published Wed, Jun 1 2016 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement