పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి.. | Sakshi
Sakshi News home page

పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి..

Published Thu, Mar 30 2017 12:34 PM

పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి.. - Sakshi

ఆగ్రా: యువతులు, మహిళలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ యాంటీ రొమియో పోలీసు బృందాలను క్రీయాశీలం చేయగా ఓ పోలీసు మాత్రం అదుపు తప్పాడు. ఇతరులు వేధిస్తే అడ్డుకోవాల్సింది పోయి తానే ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఫలితంగా అతడిపై వెంటనే బదిలీ వేటు పడింది.

వివరాల్లోకి వెళితే.. మెయిన్‌పురికి చెందిన ఎస్సై రామ్‌ నరేశ్‌ యాదవ్‌ యాంటీ రోమియో డ్రైవ్‌లో భాగంగా లోహియాలోని ఓ పార్క్‌ వద్దకు వెళ్లి ఓ అమ్మాయిని వేధించాడు. ఆమె చెవులుపట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడితో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు అక్కడ ఉన్న అమ్మాయిలపై అరుస్తూ పార్క్‌ల చుట్టూ తిరగకుండా ఇంటికి వెళ్లిపోండంటూ గట్టిగా రిచారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చి పెద్ద వైరల్‌గా మారింది. దీంతో అతడిని వెంటనే పోలీస్‌ లైన్స్‌కు బదిలీ చేశారు. దీనిపై డిపార్ట్‌మెంటల్‌ దర్యాప్తు కూడా ఆదేశించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement