పాముకాటుకు ఆర్మీ జవాన్ మృతి | Sakshi
Sakshi News home page

పాముకాటుకు ఆర్మీ జవాన్ మృతి

Published Sat, Mar 12 2016 12:07 AM

పాముకాటుకు ఆర్మీ జవాన్ మృతి - Sakshi

కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడేనికి చెందిన ఆర్టీ జవాన్ కూస కరుణాకర్ (23) జమ్మూకాశ్మీర్‌లో పాముకాటుకు గురై మృతి చెందాడు. కరుణాకర్ నాలుగేళ్ల క్రితం ఆర్మీ జవానుగా ఎంపికై జమ్ము-కాశ్మీర్‌లోని నక్రోటలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8న విధులు ముగించుకుని నిద్రిస్తుండగా పాము కాటు వేసింది.

మరునాడు ఛాతీలో నొప్పి రాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు పాము కరిచినట్లు నిర్ధారించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 10న కరుణాకర్ మృతి చెందాడు. మృతదేహాన్ని అధికారులు స్వగ్రామానికి పంపించారు.  కరుణాకర్ తన పుట్టినరోజైన మార్చి 10నే మరణించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement