లిఫ్టులో ఇరుక్కున్న అరుణాచల్ గవర్నర్ | Sakshi
Sakshi News home page

లిఫ్టులో ఇరుక్కున్న అరుణాచల్ గవర్నర్

Published Wed, Dec 2 2015 2:25 PM

లిఫ్టులో ఇరుక్కున్న అరుణాచల్ గవర్నర్ - Sakshi

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా లిఫ్టులో ఇరుక్కుపోయారు. రాజ్‌భవన్‌లో ఆయన లిఫ్టులో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన గవర్నర్.. విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి చీవాట్లు పెట్టారు. గవర్నర్ లిఫ్టులో ఉన్న సమయంలో అందులో కనీసం లైటు, ఫ్యాన్ కూడా పనిచేయలేదని, దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతోపాటు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారి వెంటనే అత్యవసర కాల్స్ చేయడంతో.. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సాక్షాత్తు గవర్నర్‌కే ఇలాంటి సమస్య వస్తే.. ఇక సామాన్యుల గతేంటని మండిపడుతున్నారు. సోమవారం ఈ ఘటన జరగడంతో మంగళవారం నాడు గవర్నర్ రాజ్‌ఖోవా విద్యుత్ శాఖాధికారులను పిలిపించి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఎందుకు ఉందని ప్రశ్నించి, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
Advertisement