సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో మరణించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ కోటి పరిహారం అందిస్తామని గురువారం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ ప్రజల కోసం అమిత్జీ తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే క్రమంలో ఇన్ఫెక్షన్ సోకి మరణించారని, ఢిల్లీ ప్రజల తరపున ఆయన త్యాగాలను తాను కొనియాడుతున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
సోనిపట్కు చెందిన 31 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ మంగళవారం సాయంత్రం భరత్నగర్ పీఎస్ వద్ద విధులు నిర్వహిస్తూ అస్వస్ధతతకు లోనవడంతో ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. బాధిత పోలీస్ కానిస్టేబుల్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని శాంపిల్స్ పరీక్షించిన ల్యాబ్ వెల్లడించిందని పోలీసులు తెలిపారు.