కేజ్రీవాల్‌ ర్యాలీలో మోదీ భజన | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ ర్యాలీలో మోదీ భజన

Published Sun, Apr 2 2017 9:58 AM

కేజ్రీవాల్‌ ర్యాలీలో మోదీ భజన - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బిత్తరపోయారు. ఆయన ఏర్పాటుచేసిన సభలో ప్రధాని నరేంద్రమోదీకి జయజయధ్వానాలు హోరెత్తడంతోపాటు, మోదీ భజన మొదలవ్వడంతో అవాక్కయ్యారు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉత్తర ఢిల్లీలోని గోండా, గౌతమ్‌ విహార్‌ చౌక్‌లో ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో కొన్ని గ్రూపుల ప్రత్యేకంగా మోదీ నామస్మరణ చేశాయి. ఆప్‌ ఇస్తున్న నినాదాలు కాకుండా వారికి నచ్చిన విధంగా మోదీ నినాదాలు చేశారు. అయితే, ఆ నినాదాలు విని చిర్రెత్తిపోయిన కేజ్రీవాల్‌.. ఇంటిపన్నును మొత్తానికే రద్దు చేస్తే తాను కూడా మోదీ.. మోదీ అని భజన చేస్తానని అన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తే తాను కూడా మోదీ మోదీ అని భజన చేస్తానని తెలిపారు. 'మోదీ.. మోదీ అని భజన చేసినంత మాత్రానా ఆకలి తీరదు. కొంతమందికి పిచ్చివాళ్లుగా మారారు' అని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement