అరుణాచల్లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ ఫైర్ ప్రణబ్తో భేటీ.. సుప్రీంలో పిటిషన్..
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ... కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ముప్పేట దాడి ప్రారంభించింది. రాష్ట్రపతి పాలన అన్యాయమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ ఆశ్రయించింది. దీనితోపాటు ఈ అంశంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమతో కలసి రావాలని బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను కలసి కోరుతామని వెల్లడించింది. సోమవారం కాంగ్రెస్ నేతలు ఆజాద్, కపిల్ సిబల్ తదితరులతో కూడిన బృందం రాష్ట్రపతిని కలసి ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడారు.
‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించింది. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. అరుణాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేతపై నిరసనగా అన్ని రకాలుగా పోరాడుతాం. కోర్టులో ప్రశ్నిస్తాం, పార్లమెంటులో నిలదీస్తాం, ప్రజలతో కలసి పోరాడుతాం’ అని పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుగల సున్నితమైన అరుణాచల్ను అస్థిరపర్చడం విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్నారు. ఈ అంశంపై బీజేపీయేతర పార్టీలతో మాట్లాడుతామని, అరుణాచల్ ఘటన వంటి పరిస్థితుల్లో వారి వెంట నిలుస్తామని పేర్కొన్నారు.
సుప్రీంలో పిటిషన్.. అరుణాచల్లో రాష్ట్రపతి పాలన చట్టవిరుద్ధమైన, అన్యాయమైన చర్య అని పేర్కొంటూ ఆ రాష్ట్ర సీఎల్పీ చీఫ్ విప్ రాజేశ్ టాచో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్ ప్రతిపాదన చేశారని అందులో ఆరోపించారు. అసలు రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయానికి కారణమైన ప్రతిపాదనలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాల్సిందిగా కేంద్రాన్ని, గవర్నర్ను ఆదేశించాలని కోరారు. గవర్నర్ పక్షపాతంతో వ్యవహరించారని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన చేసిన ప్రతిపాదన చట్టవిరుద్ధమేగాక, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
అరుణాచల్లో రాజకీయ సంక్షోభానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు విచారణలో ఉన్నాయని.. అలాంటి సమయంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం కోర్టు ధిక్కారమేనని పిటిషన్లో పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్లో నబం టుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు... దీనిపై 27న విచారణ చేపడతామంది. కాగా కాంగ్రెస్ అంతర్గత జగడాల కారణంగానే అరుణాచల్ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని.. కానీ ఆ నెపాన్ని మోదీ ప్రభుత్వంపై వేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు.
ఎన్డీయే సర్కారుపై దాడి
Published Tue, Jan 26 2016 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement