కొరుక్కుపేట (చెన్నై): రాజకీయ ప్రమేయాలే మీడియాపై దాడులకు కారణమవుతున్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై ‘దాడులు– బెదిరింపులు–మీడియాలో నేటి పరిస్థితి’పై జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఇందులో సాక్షి మీడియా తరఫున రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్రామ్, నటి, సామాజిక కార్యకర్త గౌతమి, తమిళనాడు మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్లతో పాటు పలు తమిళ మీడియా, ఇతర పత్రికలు, చానళ్ల సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్లు పాల్గొన్నారు.
రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మీడియాలో రాజకీయాల పాత్ర ఎంతున్నా, ప్రస్తుతం మీడియా, రాజకీయాలు విడిపోయాయన్నారు. తమకు అనుకూలంగా లేకపోతే ఏకంగా ప్రభుత్వాలే దాడులకు దిగడం వేదన కలిగిస్తుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు, మీడియాకు వివరణ ఇచ్చేందుకు సాహసించడం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియాపై సాగుతున్న దాడులపై చర్యలు, మీడియా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై 5 తీర్మానాలు చేశారు. తీర్మానాలను కేంద్రంతోపాటు దక్షిణ భారతంలోని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించనున్నట్లు సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ తెలిపారు. సదస్సులో జర్నలిజం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజకీయ ప్రమేయాలతో మీడియాపై దాడులు
Published Mon, Oct 23 2017 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement