తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో.. చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్న 'అమ్మ' మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేందుకు ఈ ఆడియోనే సాక్ష్యం అంటూ కొందరు అన్నాడీఎంకే అభిమానులు చెబుతున్నారు. వాట్సప్లో దీనికి సంబంధించిన ఆడియో ఫైలు విపరీతంగా షేర్ అవుతోంది. అందులో జయలలిత మాట్లాడినట్లుగా చెబుతున్నా.. నిజానికి ఇది అమ్మగొంతులా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. అయితే, ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నారు కాబట్టి, గొంతు కొంత మారి ఉంటుందన్న వాదన సైతం వినిపిస్తోంది. ఆ ఆడియోలో ఇలా ఉంది...
''నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ.. ప్రతిరోజూ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. దేవుడి దయవల్ల నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత.. నేను మీ అందరి ముందుకు వచ్చి, మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతా, నా అనారోగ్యానికి కారణం ఏంటో కూడా చెబుతా. నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరుతున్నా.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయాన్ని, అన్నాడీఎంకే అందిస్తున్న శాంతియుత పాలనను ఏమాత్రం జీర్ణించుకోలేని ప్రతిపక్షమే నా ఆరోగ్యం గురించి లేనిపోని వదంతులు వ్యాపింపజేయడానికి ఓవర్టైం పనిచేస్తోంది. కోట్లాది మంది మద్దతుదారుల ఆశీస్సులు, ఎంజీఆర్ సోదర సోదరీ మణుల ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం నన్ను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు.
ఇంతకుముందు చెప్పినట్లుగానే.. నేను మీ వల్లే, మీ అందరికోసమే ఉన్నాను. అందువల్ల ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించినట్లు గానే.. ఈనెల 17, 19 తేదీలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండు ఆకుల గుర్తుమీద ఓట్లు వేసి.. పార్టీకి ఘనవిజయం అందించాలని కోరుకుంటున్నా. జై అన్నా.. జై ఎంజీఆర్''
ఇంతకీ అది 'అమ్మ' గొంతేనా?
Published Tue, Oct 4 2016 11:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement