కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు ఉదంపూర్ – శ్రీనగర్–బారాముల్లా మార్గాన్ని వేస్తున్నారు. ఈ మార్గమధ్యంలోనే చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2019లో పూర్తయ్యే ఈ బ్రిడ్జి జమ్మూలోని బక్కల్–శ్రీనగర్లోని కత్రా–కౌరిలను కలుపుతుంది. బ్రిడ్జిల్లో బాహుబలిలాంటి దీని విశిష్టతలు చూద్దామా... –సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఇది పూర్తయ్యాక ఈ ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జి అవుతుంది. చీనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో రెండు కొండలను కలుపుతూ దీన్ని నిర్మిస్తున్నారు. 275 మీటర్ల ఎత్తులో ఉన్న షుయ్బాయ్ రైల్వే బ్రిడ్జి (చైనా)ని రెండో స్థానానికి నెడుతుంది మన చీనాబ్ బ్రిడ్జి. పారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. అంటే ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
- బ్రిడ్జి పొడవు 1.3 కిలోమీటర్లు . తనిఖీ నిమిత్తం రోప్ వే ఉంటుంది. రైల్వే లైన్తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరోదారి ఉంటుంది. కశ్మీర్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలను, గంటకు 260 కిలోమీటర్ల గాలివేగాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జిని డిజైన్ చేశారు.
- 24,000 టన్నులు. బ్రిడ్జి నిర్మాణంలో వాడుతున్న ఉక్కు. 63 ఎంఎం మందం కలిగిన పేలుళ్లను తట్టుకోగలిగే ప్రత్యేక ఉక్కును దీని నిర్మాణంలో వాడుతున్నారు. తీవ్రవాద దాడులు జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ బ్రిడ్జి నిర్మాణానికి పెడుతున్న ఖర్చు 1,100 కోట్లు.
- గంటకు 90కి.మీ. కంటే వేగంగా గాలులు వీస్తున్నట్లయితే సెన్సర్ల ద్వారా బ్రిడ్జికి ఇరువైపులా రెడ్సిగ్నల్ పడిపోతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బ్రిడ్జి పైనుంచి రైళ్ల రాకపోకలను అనుమతించరు. గాలివేగం తగ్గాక మళ్లీ ప్రయాణం మొదలవుతుంది.
బ్రిడ్జిల్లో ఇది.. బాహుబలి
Published Thu, May 4 2017 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement