మమతకు మరో షాక్ | Sakshi
Sakshi News home page

మమతకు మరో షాక్

Published Thu, Feb 5 2015 11:16 PM

మమతకు మరో షాక్

కోల్కతా: పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి మరో షాక్ తగిలింది. తాజాగా  రాజ్యసభ ఎంపీ సృంజయ్ బోస్, ఓ నటి టీఎంసీకి గుడ్ బై చెప్పారు. సృంజయ్ ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శారదా స్కాంలో అరెస్ట్ అయిన సృంజయ్ బెయిల్ వచ్చిన మరుసటి రో్జు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పశ్చిమబెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి లాకెట్ ఛటర్జీ కూడా పార్టీని వీడారు. వీరిద్దరూ బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఇటీవల టీఎంసీ నుంచి కీలక నేతలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement