సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న సంతోష్ ఎం. శెట్టి, మహేశ్ చౌగులేకు భివండీ పట్టణంలో భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) బహిరంగంగా మద్దతు పలికింది. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయం లో ఆదివారం మధ్యాహ్నం బీటీఎస్ తరఫున బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై చర్చించారు.
అనంతరం 136- పడమర భివండీ, 137- తూర్పు భివండీ నియోజక వర్గా ల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న మహేశ్ చౌగులే, సంతోష్ ఎం.శెట్టికి మద్దతు ప్రకటించా రు. ఈ సందర్భంగా సంతోష్ ఎం. శెట్టి మాట్లాడుతూ... గతంలో తనవల్ల తెలుగు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే క్షమించాలని కోరారు. ఆ మేరకు సమాజానికి క్షమాపణ పత్రా న్ని అందించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో, అత్యధికంగా తెలుగు ప్రజలు స్థిరపడిన పద్మనగర్ ప్రాంతాల్లో ఐదు స్థానాలకు సమాజం ఎంపి క చేసిన అభ్యర్థులకు తన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజల మద్దతు వల్లనే తాను 20 యేళ్లుగా రాజకీయాల్లో రాణిస్తున్నానన్నారు.
ఇప్పుడు కూడా సమాజం అండగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొట్ట మొదట తెలుగు ప్రజలు స్థిరపడ్డ పద్మనగర్, కామత్ఘర్, నయిబస్తీ, శ్రీరంగ నగర్ ప్రాంతాలను అభివృద్ది చేస్తానని తెలిపారు. అంతేగాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల, ఆస్పత్రి, ఆట స్థలం, స్కైవాక్, రోడ్ల నిర్మాణాలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భివండీ తెలుగు సమాజ్ సంస్థాపకుడు నోముల శేఖర్, అధ్యక్షుడు తుమ్మ రమేశ్, డాక్టర్ సుంక శ్రీధర్, అఖిల పద్మశాలి సమాజ్ కార్యదర్శి దాసి అంబాదాస్, పద్మశాలి సమాజ్ యువక్ మం డలి అధ్యక్షుడు వడ్లకొండ రాము, డాక్టర్ పాము మనోహర్, మాజీ కార్పొరేటర్ కళ్యాడపు బాలకిషన్, శిక్షణ్ మండలి సభాపతి రాజు గాజుంగి, కము టం సుధాకర్, గాజెంగి కృష్ణ పాల్గొన్నారు.
బీటీఎస్ మద్దతు బీజేపీకే..
Published Sun, Oct 5 2014 10:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement