* ‘డెంగీ’ దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత డొల్ల
* ఇప్పటికే రూ.26 కోట్లు చెల్లించిన బీఎంసీ
* పనిచేయడం లేదని తెలిసినా వాడుతున్న వైనం
* బీఎంసీ తీరుపై విమర్శల వెల్లువ
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో దోమల నివారణ జరగక రోజురోజుకు నగరంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు కెమికల్స్ను సరఫరా చేస్తున్న సదరు కంపెనీపై గత ఏడాది కూడా తక్కువ నాణ్యత కెమికల్స్ను సరఫరా చేసినందుకు గాను జరిమానా విధించారు. అయినా కార్పొరేషన్కు ఆ కంపెనీ ఇప్పటికీ అదే నూనెను సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2013 మార్చిలో కార్పొరేషన్ 2.57 లక్షల లీటర్ల ఆయిల్ను సరఫరా చేసేందుకు ‘యూనివర్సల్ ఆర్గానిక్స్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. రెండేళ్లకు గాను రూ.26 కోట్లను చెల్లించింది. కాగా ఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్లో కల్తీ ఉందని తేలడంతో సదరు కంపెనీకి అదే ఏడాది జూన్లో కార్పొరేషన్ జరిమానా విధించింది. రూ.65 లక్షల జరిమానాను డిపాజిట్ చేయాలని కార్పోరేషన్ సదరు కంపెనీని ఆదేశించింది. అయితే, ఇప్పటికీ అదే కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్నే ఉపయోగించడం గమనార్హం.
ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేత మనోజ్ కోటక్ మాట్లాడుతూ.. గతంలో కల్తీ మందును సరఫరా చేయడంతో 2011లో పుణే మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ ఈ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాయన్నారు. ఈ కంపెనీకి శక్తి వంతమైన మందును సరఫరా చేసే సామర్ధ్యం లేదని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పిందన్నారు. నగరంలో రోజురోజు డెంగీ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూఉంటే మరో పక్క బీఎంసీ దోమల నివారణకు కల్తీ ఆయిల్తో కూడిన పొగను విడుదల చేసేందుకు విస్తృతంగా డ్రైవ్ను ప్రారంభించిందని మనోజ్ కోటక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బీఎంసీ నిర్లక్ష్యం వల్లే దోమల వృద్ది జరిగి నగరంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆయిల్ అంత ప్రభావం చూపదని తెలిసినా ఇంకా దానిపై ప్రజాధనాన్ని వెచ్చించడంపై ఆయన ఆవేదన వ్యక్తం తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, నూనె నమూనాను పరీక్షలకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే, కల్తీ నూనె వాడకానికి బాధ్యులైన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కల్తీ నూనె అని తెలిసినా..
Published Sun, Nov 9 2014 11:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement