రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు

Published Tue, Mar 10 2015 4:29 PM

రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు - Sakshi

ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది.  గత సాధారణ ఎన్నికల్లో భాగంగా మహత్మా గాంధీ హత్య అంశంపై రాహుల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్సే కారణమని రాహుల్ ఆ సమయంలో విమర్శించడంతో కేసు నమోదయ్యింది.

 

దీనిపై మంగళవారం హైకోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 30వ తేదీన భీవండి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కు హైకోర్టు సూచించింది.

Advertisement
Advertisement