నేషనల్ డెస్క్: 2014లో వెలువడిన పలు పుస్తకాలపై తీవ్రస్థాయిలోనే వివాదాలు వెల్లువెత్తాయి. పుస్తకాల్లోని సంచలనాత్మక అంశాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలూ వచ్చాయి. రచయితలకు ఈ స్థాయిలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. అధికారంలో అగ్రస్థానంలో ఉన్న నేతలనే లక్ష్యంగా చేసుకున్న పుస్తకాలు ఈ ఏడాది పెద్దసంఖ్యలో వచ్చాయి.
ఠ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాజీ మీ డియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అన్న పుస్తకం వివాదాస్పదమైంది. యూపీఏ హయాంలో మ న్మోహన్ బలహీనమైన ప్రధానిగా మిగిలిపోయారని, మంత్రివర్గ సహచరుల అవకతవకలపై కూడా ఆయన ఏమీచేయలేకపోయారని సంజ య్ బారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించాయి.
కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ రాసిన ‘క్రూసేడర్ ఆర్ క్రాన్స్పిరేటర్? కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్’ అనే పుస్తకంలో కూడా మన్మోహన్పై భారీ విమర్శలొచ్చాయి.
ఠ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్‘యువర్స్ సిన్సియర్లీ’ పుస్తకంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యతిరేకించడం వల్లనే సోనియా2004లో ప్రధాని పదవిని స్వీకరించలేదని నట్వర్ సింగ్ పేర్కొనడం వివాదం రేకెత్తించింది.
ఠ‘ది డ్రమెటిక్ డికేడ్: ది ఇందిరాగాంధీ ఇయర్స్’ శీర్షికతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం కూడా ఎంతో సంచలనానికి కారణమైంది. ఇం దిర హయాంలో విధించిన ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) గురించి ప్రణబ్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని నిబంధనలను గురించి పట్టిం చుకోకుండా ఎమర్జెన్సీని విధించడం అప్పట్లో ఇందిరా గాంధీ తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయమని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో భారీమూల్యమే చెల్లించుకోవాలకల్సి వచ్చిందని ప్రణబ్ ముఖర్జీ రాశారు.
పుస్తకాలూ, వివాదాలు..
Published Mon, Dec 29 2014 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement