అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యం | Sakshi
Sakshi News home page

అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యం

Published Tue, Aug 2 2016 8:44 AM

అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యం - Sakshi

బులంద్షహర్(యూపీ): 'ఇలాంటి ఘటనలు ఇక్కడ జరగడం మొదటిసారి కాద'ని దోస్తాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. నోయిడాకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెపై దోస్తాపూర్ లో దుండగులు శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇంతకుముందు ఇక్కడ గ్యాంగ్ రేప్ లు జరిగాయని గ్రామస్తులు తెలిపారు.

12 రోజుల క్రితం రాత్రి సమయంలో టెంపోలో వెళుతున్న మహిళను బలవంతంగా బయటకు లాగి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఘటనా స్థలం నిర్మానుష్యంగా ఉండడం, వీధి దీపాలు, పోలీసుల పహారా లేకపోవడంతో కామాంధులు రెచ్చిపోతున్నారని తెలిపారు.

అత్యాచారాలు, దోపిడీలు నిత్యకృత్యంగా మారాయని దేవరాజ్ థాకూర్ అనే స్థానికుడు చెప్పాడు. తమపై జరిగిన అఘాయిత్యాలపై బాధితురాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మృగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని గోవింద్ పాల్ సింగ్ తెలిపారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. అయితే నేరాలకు నియంత్రణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను చట్టం ముందు నిలబెడతామని డీఐజీ(మీరట్ రేంజ్) లక్ష్మి సింగ్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement